AP Assembly Elections 2024: ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల్లో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ కూటమి బరిలో దిగింది. ఏపీలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతోపాటు జాతీయ పార్టీ కాంగ్రెస్లు నామ మాత్రంగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ కూటమి తరుపున ఎన్నికల బరిలో దిగింది.
AP Assembly Elections 2024: ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ గెలిచే సీట్లు ఇవేనా.. పందెం రాయుల్ల బెట్టింగ్ ఇదే..
ఈ నేపథ్యంలో ఏపీలో బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయనేది ఇపుడు పందెం రాయుళ్లు పెద్ద ఎత్తున పందెం కాస్తున్నారు.Jr NTR Assets: జూనియర్ ఎన్టీఆర్ ఇళ్లు.. ఆస్తులు ఎన్ని వేల కోట్లో తెలుసా..! మైండ్ బ్లాంక్ చేస్తోన్న అస్సెట్స్ వాల్యూ..: ఆంధ్ర ప్రదేశ్లో ఈ నెల 13న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా 25 లోక్సభ సీట్లతో పాటు 175 అసంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కేంద్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ.. తెలుగుదేశం, బీజేపీలతో కలిసి కూటమిగా ఏర్పడి ఎన్నికల బరిలో దిగింది.
ఇందులో పార్లమెంట్ స్థానాల విషయానికొస్తే.. నర్సాపురం, అనకాపల్లి స్థానాల్లో బీజేపీ ఖచ్చితంగా గెలుస్తుందనే చాలా మంది పందెం రాయుళ్లు పందెం కాస్తున్నారు. కొన్ని సర్వేల్లో రాజమండ్రిలో బీజేపీ వర్సెస్ వైసీపీ మధ్య తీవ్ర పోటీ ఉందని చెబుతున్నారు. ఇందులో బీజేపీ అతి తక్కువ మెజారిటీతో బయటపడే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయనే మాట వినిపిస్తోంది. మరోవైపు రాజంపేటలో వైసీపీకి పూర్తి పట్టుంది. అక్కడ మిథున్ రెడ్డి ఎంపీగా పోటీ చేసారు. మరోవైపు బీజేపీ తరుపున మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి బలమైన అభ్యర్ధిగా గట్టిపోటీ ఇచ్చారు.
మరోవైపు అరకు లోక్సభ సీటు విషయంలో ఇక్కడ బీజేపీ కంటే వైసీపీకే ఎక్కువ అవకాశాలున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా ఏపీలో జరిగిన పార్లమెంట్ సీట్లలో బీజేపీ 2 సీట్లు ఖచ్చితంగా గెలుస్తుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. రాజమండ్రిలో నువ్వానేనా అన్నట్టుగా పోటీ ఉంది. ఒకవేళ బీజేపీ గెలిస్తే అదనంగా ఈ సీటు తప్పించి మిగిలిన మూడు సీట్లలో అసలు బీజేపీ గెలిచే అవకాశాలే లేవని అందరు చెప్పుకుంటున్నారు. పందెం రాయళ్లు కూడా ఈ మూడు సీట్లపై ఎక్కువ ఫోకస్ పెట్టారు.
అటు ఏపీలో విశాఖ పట్నం సిటీ నుంచి విష్ణుకుమార్ రాజు, కైకలూరు నుంచి కామినేని శ్రీనివాస్, విజయవాడ పశ్చిమం నుంచి గెలిచే అవకాశాలున్నాయి. మొత్తంగా ఈ మూడు సీట్లపై పందెం రాయళ్లు ఎక్కువ హోప్స్ పెట్టుకున్నారు. మొత్తంగా 3 పార్లమెంట్ సీట్లతో పాటు మూడు అసెంబ్లీ సీట్లు బీజేపీ ఖచ్చితంగా గెలిస్తుందని చెబుతున్నారు. ముఖ్యంగా కేంద్రంలో మరోసారి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని బీజేపీ అధికారంలోకి వస్తుందని అన్ని సర్వేలు చెబుతున్నాయి. ఆ సర్వేలతో పాటు యూత్ చాలా మంది బీజేపీవైపు మొగ్గు చూపినట్టు తెలుస్తోంది.
Bjp Winning Seats In Andhra Pradesh Lok Sabha Polls 2024 4Th Phase Lok Sabha Polls 2024 BJP Narendra Modi
Malaysia Latest News, Malaysia Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Prashant kishor: ప్రశాంత్ కిషోర్ సంచలనం.. ఆ పార్టీ ఏపీలో చిత్తుగా ఓడిపోతుందంటూ వ్యాఖ్యలు..Ap assembly elections 2024: ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడం కలలో కూడా జరగదన్నారు.
Read more »
Pawan Kalyan: అకీరా, ఆద్యాకు అన్ని ఇచ్చా.. పవన్ ఎమోషనల్!!Pawan Kalyan : జనసేనాని పవన్ కళ్యాణ్ 2024 ఆంధ్ర ప్రదేశ్కు జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసారు.
Read more »
Yogi Adityanath Comments: కాంగ్రెస్ గెలిస్తే దేశంలో ముస్లిం చట్టం అమలు, యోగి ఆదిత్యనాధ్ వివాదాస్పద వ్యాఖ్యలుLoksabha Elections 2024 Uttar pradesh cm yogi adityanath made controvesial comments రానున్న లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే దేశంలోని ఆస్థులన్నీ ముస్లింలకే ఇచ్చేస్తారంటూ ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.
Read more »
Maldives Elections 2024: మాల్దీవుల్లో ఎన్నికల్లో చైనా అనుకూలతకే పట్టం, ముయిజ్జుకే మరోసారి అధికారంMaldives Elections 2024 Updates President muizzus ruling party మాల్దీవుల పార్లమెంట్ ఎన్నికల్లో ఆ దేశాధ్యక్షుడు ముయిజ్జు సారధ్యంలోని అధికార పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ మరోసారి ఘన విజయం నమోదు చేసింది
Read more »
Bettings on Ap Elections: ఏపీ ఎన్నికల ఫలితాలపై భారీగా పందేలు, లక్షకు 5 లక్షలు బెట్టింగ్Andhra pradesh Elections 2024 Bettings on pawan kalyan, chandrababu majority ఏపీలో ఇప్పుడు ఎక్కడ విన్నా ఎవరు అధికారంలో వస్తారనే చర్చే ఉంది. అటు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఇటు ప్రతిపక్ష తెలుగుదేశం-జనసేన-బీజేపీలు దేనికవే అధికారంపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
Read more »
PK on YS Jagan: జగన్ కు ఏపీలో అన్ని సీట్లు వస్తే నా మొఖం మీద పేడ కొడతారు.. ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు..PK on YS Jagan: ప్రశాంత్ కిషోర్ మరోసారి ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలపై తనదైన శైలిలో స్పందించారు. ఏపీలో వై.యస్.జగన్మోహన్ రెడ్డికి బీజేపీ, టీడీపీ, జనసేక కూటమి కంటే ఎక్కువ సీట్లు వస్తే ప్రజలు నా మొఖం మీద పేడ కొడతారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేయడం రాజకీయ ప్రాధానత్య సంతరించుకుంది.
Read more »